నేడు పలు ప్రాంతాలలో విద్యుత్ అంతరాయం

VSP: పీఎంపాలెం సబ్ స్టేషన్ నందు మరమ్మతుల దృష్ట్యా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. అశోక్ నగర్, ఆర్ హెచ్ కాలనీ, ఫిష్ మార్కెట్ ఏరియా, రెవెన్యూ లేఔట్ ఏరియా, బింద్రానగర్, రిజిస్టర్ ఆఫీసు శివాలయం వీధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని, ప్రజలు సహకరించాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ కోరారు.