ఎంపీ సురేష్ రెడ్డిని కలిసిన సర్పంచులు
NZB: రాజ్యసభ ఎంపీ కేతిరెడ్డి సురేష్ రెడ్డిని కమ్మర్ పల్లి మండలంలోని పలువురు సర్పంచులు ఆదివారం కలిశారు. HYDలోని ఆయన నివాసంలో ఎంపీ సురేష్ రెడ్డిని హాస కొత్తూర్ సర్పంచ్ నలిమెల రేవతి గంగారెడ్డి, చౌట్ పల్లి సర్పంచ్ మహబూబ్ కలిసి గ్రామాల్లో అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని విన్నవించారు. వెంటనే స్పందించిన ఎంపీ సురేష్ రూ.16 లక్షల నిధులను మంజూరు చేశారు.