ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు
NGKL: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు నోడల్ అధికారి వెంకట్ రమణ తెలిపారు. గురువారం జరిగిన ఇంటర్ పరీక్షలకు మొత్తం 6,211 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 5,963 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు. 248 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు.