కాశీబుగ్గ ఆలయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్
SKLM: కాశీబుగ్గ ఆలయ ప్రాంగణానికి మంత్రి నారా లోకేష్ చేరుకుని ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై వివరాలను స్థానిక అధికారులు, పోలీసుల నుంచి తెలుసుకున్నారు. బాధితుల పరిస్థితిని ఆరాతీశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.