స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి ఎస్సీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ రెన్యువల్ గడువును ఏప్రిల్ 20 వరకు పొడిగించారు. అర్హులైన విద్యార్థులు తెలంగాణ ఈ-పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. గతంలో స్కాలర్షిప్ పొందని వారు ఆధార్ సీడింగ్, బ్యాంక్ ఖాతా ప్రక్రియలను త్వరగా పూర్తి చేయాలని అధికారులు సూచించారు.