క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠం బీఆర్ఎస్ కైవసం
MNCL: గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపుతున్న క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికలో BRS-CPI కూటమి ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ స్థానాలను కైవసం చేసుకుంది. ఛైర్మన్గా డా.సంధ్యారాణి(BRS), వైస్ ఛైర్మన్గా సరిత (CPI) ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలో 10 మంది BRS, 4 గురు CPI కౌన్సిలర్ల మద్దతుతో ఈ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది.