ఫేక్ ప్రచారాలతో వైసీపీ పబ్బం గడుపుతుంది: ఎమ్మెల్యే

ఫేక్ ప్రచారాలతో వైసీపీ పబ్బం గడుపుతుంది: ఎమ్మెల్యే

GNTR: ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ, సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని పక్కదోవ పట్టించేలా వ్యవహరిస్తోందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ ఆరోపించారు. ప్రజల కోసం పనిచేస్తున్న టీడీపీ నాయకులపై తప్పుడు పోస్టులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని గురువారం విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా చంద్రబాబు నాయుడు చేస్తున్న సంక్షేమాన్ని ఆపలేరన్నారు.