నేడు జిల్లాలో PGRS కార్యక్రమం
VZM: కలెక్టరేట్ ఆడిటోరియంలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించనున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటకు వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, ప్రజలు తమ అర్జీలను వారికి అందజేయాలని కోరారు.