రేపు అచ్చంపేటకు సీఎం రాక
WNP: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో రేపు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. అచ్చంపేట మండలంలోని మాలపాడు తండా గ్రామంలో వరద ప్రవాహాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం మర్లపాడు వద్ద ఎస్ ఎల్బి సి వద్ద అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు.