తుఫాను నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ సిద్ధం
VSP: బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' వాయుగుండం సోమవారానికి తుఫానుగా మారుతుందని ఎన్టీఆర్ఫ్ కమాండర్ విశాఖలో వెల్లడించారు. అలాగే మంగళవారంకు తీవ్ర తుఫానుగా మారనుందని తెలిపారు. దీని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైందని, ముంపు ప్రాంతాల్లో ప్రజలకు సహాయ సహకారాలు అందించడానికి ఎన్డీఆర్ఎఫ్ ఆరు బృందాలను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.