ఆలయ నిర్మాణానికి ముస్లిం వ్యక్తి విరాళం
KNR: ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాహెబ్ రూ.5,016 విరాళం అందజేసి మతసామరస్యాన్ని చాటారు. గురువారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ గీతాంజలి, పాలకవర్గానికి ఈ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అతన్ని వారు అభినందించారు.