దుబాయ్ ఎయిర్పోర్ట్పై డ్రోన్ల దాడి
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ డ్రోన్ల దాడిలో దుబాయ్ విమానాశ్రయం తీవ్రంగా దెబ్బతింది. యూఏఈ, ఖతార్లోని పలు ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. యూఏఈలోని అమెరికా స్థావరం జబేలీ అలీ పోర్టును ఇరాన్ క్షిపణి తాకగా, అబుదాబి ఎయిర్పోర్టుపై కూడా దాడులు జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాలతో గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది.