నల్గొండలో డిగ్రీ విద్యార్థిని సూసైడ్

నల్గొండలో డిగ్రీ విద్యార్థిని సూసైడ్

నల్గొండ పట్టణంలోని రవీందర్‌నగర్‌లో బీసీఈ హాస్టల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న శృతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఉన్నత చదువులు కొనసాగించాలని కలలు కన్న శృతికి, ఇంట్లో జరుగుతున్న పెళ్లిచూపుల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. కాగా.. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.