శ్రీరాంసాగర్ గేట్ల మూసివేత
NZB: శ్రీరాంసాగర్ జలాశయానికి ప్రస్తుతం వరద ఉధృతి తగ్గింది. దీంతో అధికారులు ప్రాజెక్టు వరద గేట్లను ఇవాళ మూసివేశారు. అనంతరం ప్రస్తుతం 9,454 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ఎస్కేప్ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు 650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాకతీయ, లక్ష్మి కాల్వలకు నీటి విడుదలను నిలిపేశారు.