అక్రమ మైనింగ్ అధికారులు దాడి
ప్రకాశం: పెద్దచెర్లోపల్లి (M) తుర్కపల్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం మార్కాపురం మైనింగ్ అధికారులు దాడి చేసి నిల్వ ఉంచిన తెల్ల రాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న జేసీబీని స్వాధీనం చేసుకొని రెవిన్యూ అధికారులకు అప్పగించినట్లు సమాచారం.