ఎవరు 'బుక్' అవుతారో?

VSP: బురుజుపేట కనకమహాలక్ష్మి ఆలయంలో విరాళాలకు సంబంధించిన రసీదుల బుక్ ఒకటి మిస్సైంది. 2017 నుంచి ఇప్పటి వరకు ఆభరణాల లెక్కింపు జరగకపోవడంతో ఇటీవల విజయవాడ నుంచి వచ్చిన తనిఖీ బృందం అప్పటి నుంచి పనిచేస్తున్న వారిని విశాఖకు పిలిపించి లెక్కలు వేసింది. స్టోర్ రూమ్లో ఉన్న 8వెండి వస్తువుల వివరాలు మినహా మిగతా ఆభరణాల లెక్కలు సరిపోయాయని తెలిపింది.