'పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలి'
SKLM: జిల్లాలోని అన్ని గ్రామాల పూర్తి స్థాయి సమాచారం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలని ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. ప్రతీ గ్రామాన్ని పోలీసులు తరచుగా సందర్శించాలన్నారు. నిన్న వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ ఎచ్చెర్ల PSను సందర్శించారు. ముఖ్యమైన కేసుల రికార్డులు, దర్యాప్తును పరిశీలించారు. పెండింగ్లో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు .