లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయంలో మార్గశిర పూజలు

లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయంలో మార్గశిర పూజలు

NDL: జూపాడుబంగ్లా మండలం తర్తూరు గ్రామంలో వెలసిన లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయంలో మార్గశిర మాసం ఆదివారం సందర్భంగా భక్తులు వైభవంగా పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథ స్వామికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళహారతి వంటి సేవలు జరిగాయి. ఈ పూజల్లో పాల్గొన్న భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలు అందజేశారు.