ఈనెల 28కి జాతీయ లోక్ అదాలత్ వాయిదా
WGL: ఈనెల 14న నిర్వహించాల్సిన జాతీయ లోక్ అదాలత్ ను ఈనెల 28కి వాయిదా వేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, ఆస్తి పంపకాలు, డబ్బుకు సంబంధించిన సివిల్ కేసులు తదితర పెండింగ్ వివాదాలను ఇందులో పరిష్కరించుకోవచ్చని గురువారం అధికారులు తెలిపారు.