పహల్గామ్ ఉగ్రదాడి ఖండిస్తూ పొదిలిలో నల్ల బ్యాడ్జీలతో నిరసన

ప్రకాశం: జమ్మూకశ్మీర్లోని పహల్గామ్ అమాయకపు పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ పొదిలి పట్టణంలోని పెద్ద బస్టాండ్ సెంటర్లో ఆదివారం జనసేన పార్టీ నాయకులు హల్చల్ చేశారు. జహీర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు నల్ల బ్యాడ్జీలు ధరించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, బీజేపీ, తెదేపా కూటమి నాయకులు పాల్గొన్నారు