VIDEO: జనగామలో సంబరాలు చేసుకున్న అభిమానులు
JN: టీ20 క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ పై భారత్ సాధించిన ఘన విజయం సందర్భంగా JN పట్టణంలో క్రికెట్ అభిమానులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు. బస్టాండ్ చౌరస్తా నుంచి రైల్వే స్టేషన్ వరకు త్రివర్ణ జెండాలతో ర్యాలీ నిర్వహించి, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. మిఠాయిలు పంచుకుని, పటాకులు కాల్చి, ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.