రాప్తాడు మార్కెట్ యార్డు నూతన కమిటీ నియామకం

ATP: రాప్తాడు మార్కెట్ యార్డు నూతన కమిటీ సభ్యులను ప్రభుత్వం ప్రకటించింది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్తో పాటు మొత్తం 15మంది సభ్యులతో కూడిన కమిటీని ప్రకటించారు. ఛైర్మన్గా బోయపాటి సుధాకర్, వైస్ ఛైర్మన్గా గంగులకుంట కృష్ణయ్య నియమితులయ్యారు. వారు MLA పరిటాల సునీతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పని చేస్తామని తెలిపారు.