రన్వేపైకి వెళ్లిన విమానంలో పొగలు
HYD: శంషాబాద్ విమానాశ్రయంలో రన్వేపైకి వచ్చిన ఇండిగో విమానం (హైదరాబాద్ సిలిగురి)లో పొగలు వచ్చిన ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. 206 మంది ప్రయాణికులు ఉన్న ఈ విమానం రాత్రి 8.20 గంటలకు రన్వేపైకి వచ్చింది. గాలిలోకి ఎగరడానికి సిద్ధమవుతుండగా విమానంలో పొగలు రావడంతో ఇంజినీరింగ్ నిపుణులు గంటన్నర శ్రమించి సాంకేతిక లోపాన్ని సరిదిద్దారు.