భైరన్పల్లి పేరును వీర భైరన్పల్లిగా మార్చాలని సీఎంకు వినతి
SDPT: దూల్మిట్ట మండలంలోని భైరన్పల్లి గ్రామాన్ని వీర భైరన్పల్లిగా మార్చాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శనివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అమరవీరుల వీరోచిత వారసత్వాన్ని రాబోయే తరాలకు గుర్తుంచుకునేలా గ్రామం పేరును అధికారికంగా వీర బైరన్పల్లిగా మార్చాలని ఎంపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు పేర్కొన్నారు.