ఇసుక లారీలు నియంత్రించాలని ఎస్సైకి వినతి

ములుగు: ఏటూరునాగారం మండలకేంద్రంలో ఇసుక లారీలను నియంత్రించాలని ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్కు కాంగ్రెస్ నేతలు బుధవారం వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు మాట్లాడుతూ.. ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో ఎటువంటి ఇసుక క్వారీలు లేవని, సోషల్ మీడియాలో కావాలని అసత్య ప్రచారాలు చేస్తే సహించేది లేదన్నారు.