భీమవరంలో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

భీమవరంలో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

W.G: భీమవరంలో నకిలీ నోట్ల ముఠాను సీఐ నాగరాజు అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రికి చెందిన గోపీచంద్రరెడ్డి, సాయిలు కలిసి పట్టణానికి చెందిన జోగ శివశంకర్ కు రూ.3 లక్షలకు రూ.9 లక్షల నోట్లు ఇస్తామని ఆశ చూపారని తెలిపారు. శివశంకర్ సమాచారంతో సీఐ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గతంలోను ఇదే తరహాలో మోసం చేసినట్లు వీరు ఒప్పుకున్నారన్నారు.