VIDEO: టోల్గేట్ వద్ద దొంగ అరెస్ట్
అన్నమయ్య: పీలేరు మండలం దుర్గంవారి పల్లి టోల్గేట్ వద్ద బుధవారం పోలీసులు ఒక దొంగను అరెస్ట్ చేశారు. నిందితుడు ఎవరూ లేని సమయంలో ఓ ఇంట్లోకి చొరబడి మూడు గ్యాస్ సిలిండర్లు, రూ. 15 వేల నగదు దొంగిలించినట్లు తెలిసింది. స్థానికులు ఈ ఘటనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.