ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై మారుతీ శిక్షణ

ఈవీ ఛార్జింగ్ స్టేషన్లపై ఐటీఐల్లో మారుతీ శిక్షణ ఇవ్వనుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న 130 ఐటీఐల్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా ఏటా 4,100 మందికిపైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు 3.9 కోట్లను కేటాయించింది. శిక్షణ పొందిన వారు సెప్టెంబర్ నెల నుంచే ఆటోమొబైల్ పరిశ్రమలో చేరవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.