రాష్ట్ర అంగన్వాడీ జనరల్ సెక్రటరీగా సుజాత

ప్రకాశం: వైసీపీ రాష్ట్ర అంగన్వాడీ విభాగం జనరల్ సెక్రటరీగా కనిగిరికి చెందిన ఏడవ వార్డు కౌన్సిలర్ తమ్మినేని సుజాత రెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సుజాత పేరును విడుదల చేసింది. తనకు అవకాశం ఇచ్చిన వైసీపీ అధినేత జగన్కు, కనిగిరి నియోజకర్గ ఇంచార్జ్ నారాయణకు కృతజ్ఞతలు తెలిపారు.