TIMS ఆసుపత్రిలో 50 పడకలు.. విదేశీయుల కోసం
HYD: HYD సనత్నగర్ టీమ్స్ హాస్పిటల్లో విదేశీ రోగుల కోసం ప్రత్యేకంగా 50 పడకలను కేటాయించినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యమన్నారు. అదేవిధంగా నిమ్స్ హాస్పిటల్లో నిర్మిస్తున్న కొత్త బ్లాక్లో కూడా విదేశీ రోగుల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.