పీఎం ఈజీపీ కార్యక్రమంపై అవగాహన
NRML: సారంగాపూర్ మండలంలోని చించోలి–బి గ్రామ మహిళా ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి సృష్టి పథకం పై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్, టీఎస్డబ్ల్యుసీడీసీ విజయలక్ష్మి పాల్గొని PMEGP,PMFME పథకాలపై వివరించారు.