రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన
VKB: బషీరాబాద్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ దగ్గర ఆదివారం SI శ్రీశైలం యాదవ్ రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనదారులు సీట్బెల్ట్, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. అధిక వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, డ్రైవింగ్ సమయంలో మొబైల్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని అవగాహన కల్పించారు.