మహిళలకు హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన
KDP: DSP రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో మైదుకూరు పట్టణంలోని MPDO ఆఫీస్లోని వెలుగు కార్యాలయంలో మైదుకూరు మండలం మహిళా సమైక్య సంఘాల లీడర్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత కోసం ప్రభుత్వం - పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలు, హెల్ప్ లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అర్బన్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.