రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
NTR: కంచికచర్ల మండలం మొగులూరు గ్రామంలో డోనబండ–కీసర రాష్ట్ర రహదారి మెరుగుదల పనులకు శంకుస్థాపన జరిగింది. రూ.1.50 కోట్ల వ్యయంతో కిలోమీటర్ 14 నుంచి 21 వరకు ఆర్&బీ రోడ్డు అభివృద్ధి చేపట్టనున్నారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈ కార్యక్రమంలో పాల్గొని పనులను ప్రారంభించారు. ఈ రోడ్డు పూర్తైతే రైతులకు మరింత ఉపయోగంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.