సైబర్ నేరలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రజలను అప్రమత్తం చేశారు. సైబర్ నేరగాళ్లు ప్రజల సొమ్మును దోచుకోవడానికి మల్టీ లెవెల్ మార్కెటింగ్ వంటి గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. ప్రజలు ఈ తరహా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.