53 వేల మందికిపైగా క్యాన్సర్ లక్షణాలు గుర్తింపు
AP: రాష్ట్రంలో 39 లక్షల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఇందులో 9,963 మందికి బ్రెస్ట్, 22,861 మందికి సర్వైకల్, 26,639 మందికి నోటి క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయన్నారు. మిగిలిన వారికి 6 నెలల్లోగా స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేసేలా రూపకల్పన చేస్తున్నామని వెల్లడించారు.