అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

KKD: పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఈబీసీ కాలనీలో షేక్ శుభానికి చెందిన తాటాకు ఇల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వర్మ గురువారం వారిని పరామర్శించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.