ఆర్యూబీ నీటి మట్టాన్ని పరిశీలించిన తహసీల్దార్

VZM: కొత్తవలస ఆర్యూబీ ఏకాదాటి వర్షంతో పీకల్లోతు మునిగిపోయింది. కలెక్టర్ అంబేద్కర్ ఆదేశాలతో సోమవారం రాత్రి మండల తహసీల్దార్ అప్పలరాజు, డిప్యూటీ ఎంపీడీవో శ్రీదేవి, సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో నీటిమట్టాన్ని పరిశీలించారు. ప్రస్తుత పరిస్థితిని కలెక్టర్ నివేదిస్తామని చెప్పారు. ఆయన వెంట రెవెన్యూ పరిశీలకులు షణ్ముఖరావు, కార్యదర్శి, వీఆర్వోలు ఉన్నారు.