కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
MNCL: జన్నారం మండలంలోని లింగాయపల్లిలో వీధి కుక్క దాడి చేయడంతో ఆరేళ్ల బాలునికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గ్రామానికి చెందిన ఆదిత్య సోమవారం ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ కుక్క దాడి చేసి బాలుని పెదవి, చెంపలను కొరికింది. దాడి ఘటన చూసిన అక్కడివారు పరుగున వచ్చి కర్రలతో దాడి చేయగా కుక్క పారిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు. బాలున్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.