కల్తీ నెయ్యి కేసు.. వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు

కల్తీ నెయ్యి కేసు.. వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు

AP: శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ వ్యవహారంపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో సిట్ దూకుడు పెంచింది. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 13న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కాగా ఇప్పటికే కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు.