నిండుకుండలా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టు
MNCL: హాజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు కాగా.. నీటి నిల్వ సామర్థ్యం 20.1754 టీఎంసీలకు ప్రస్తుతం అంతే మేర నీటితో నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల నుంచి 16936 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అధికారులు 3 గేట్లు ఎత్తి అదే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేశారు.