విద్యుత్ షాక్తో వానరం మృతి
MHBD: తొర్రూరు మున్సిపాలిటీలోని 2వ వార్డులో ఇవాళ ఉదయం ఓ విద్యుత్ స్తంభంపై వానరం కరెంట్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కాసేపు విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. స్తంభంపై విగతజీవిగా పడి ఉన్న వానరాన్ని చూసి కాలనీ వాసులు, బాటసారులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు తక్షణమే స్తంభంపై ఉన్న వానరాన్ని తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.