జాతీయ లోక్ అదాలత్.. కిక్కిరిసిన కోర్టు హాల్

VZM: జాతీయ లోక్ అదాలత్ సందర్బంగా కొత్తవలస కోర్టు హాల్ కక్షిదారులతో కిక్కిరిసిపోయింది. ఏళ్ళ కాలం నుండి కోర్టులు చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయకుండా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. రాజీయే రాజ మార్గం అనే నినాదంతో దీర్ఘకాలంలో ఉన్న సమస్యలు లోక్ అదాలత్లో పరిష్కరించుకోవాలని మేజిస్ట్రేట్ డా.సముద్రాల విజయ్ చందర్ కక్షిదారులకు పిలుపునిచ్చారు.