పీజీ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన VC
MBNR: పాలమూరు యూనివర్సిటీ వీసీ శ్రీనివాస్ బుధవారం పీజీ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతులు, ల్యాబ్ కార్యకలాపాలు, పరికరాల వినియోగాన్ని పరిశీలించారు. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠ్యాంశాలను అధ్యయనం చేయాలని, ప్రాక్టికల్కు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. అధ్యాపకులతో చర్చించి బోధన విధానాలపై సూచనలు చేశారు.