నిరుపేదలకు ఇండ్ల స్థ‌లాలు కేటాయించాలని వినతి

నిరుపేదలకు ఇండ్ల స్థ‌లాలు కేటాయించాలని వినతి

BHNG: బీబీనగర్ మండలం కొండమడుగులో ఇండ్లు లేని ప్రజలకు ఇండ్ల స్థ‌లాలు కేటాయించాలని కొండమడుగు గ్రామస్తులు ఇవాళ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 900 మంది ద‌రఖాస్తు చేసుకున్నారని, అందులో 57 మంది ఎంపికై ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు.