దుండ్రపల్లి గ్రామ సర్పంచ్గా జంగం అంజయ్య
SRCL: బోయిన్పల్లి మండలం దుండ్రపల్లి గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి జంగం అంజయ్య 37 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాదించారు. తనను గెలిపించిన గ్రామ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా గ్రామస్తులు వారిని ప్రత్యేకంగా అభినందించారు. దీంతో గ్రామంలో సంబరాలు అంబరాన్ని అంటాయి.