గోపాలపురంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
ప్రకాశం: పామూరు మండలం గోపాలపురంలో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర ఆదేశాల మేరకు పామూరు నీటి సంఘం ఛైర్మన్ పాలపర్తి రమణయ్య ఆధ్వర్యంలో మంగళవారం త్రీఫేజ్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.