కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్యే
E.G: రంగంపేట మండలం దొంతమూరులో కనకదుర్గమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవం వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున అమ్మ వారిని భక్తులు దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయానికి వెళ్లిన ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.