పోలీస్ ప్రజావాణిలో 9 ఫిర్యాదులు
MDK: మెదక్ పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తొమ్మిది ఫిర్యాదులను స్వీకరించినట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. బాధితుల నుంచి సమస్యలు విని, చర్యలకై సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పోలీస్ స్టేషన్లను మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నేరుగా సంప్రదించాలని ఎస్పీ సూచించారు.