అలానే చేస్తుంటే పాక్ తుడిచిపెట్టుకుపోతుంది: మనోజ్ సిన్హా

ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత సాయుధ బలగాల శౌర్యం, ధైర్యాన్ని JK లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రశంసించారు. నేటి యువతరం ప్రజాస్వామ్య విలువలను కాపాడుతుందని వ్యాఖ్యానించారు. ఆర్మీ తరహాలోనే యువత ఆవిష్కరణలో దేశ ఆర్థికశక్తిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. అభివృద్ధిపై దృష్టి సారించకుండా ఉగ్రవాదాన్ని ఇలాగే పెంచి పోషిస్తుంటే పాక్ తుడిచిపెట్టుకుపోతుందని చురకలంటించారు.